AP News: గణేష్‌ ఉత్సవాలకు వైసీపీ సర్కార్‌ ఆటంకాలు సృష్టిస్తోంది: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-08-28T21:16:37+05:30 IST

గణేష్‌ ఉత్సవాలకు వైసీపీ సర్కార్‌ ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ నేత సోమువీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.

AP News: గణేష్‌ ఉత్సవాలకు వైసీపీ సర్కార్‌ ఆటంకాలు సృష్టిస్తోంది: సోమువీర్రాజు

అమరావతి: గణేష్‌ ఉత్సవాలకు వైసీపీ సర్కార్‌ ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ నేత సోమువీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. నిబంధనల పేరుతో గణేష్‌ ఉత్సవాలకు పరోక్ష ఆటంకాలా? అని ప్రశ్నించారు. గణేష్‌ మండపాల సంఖ్యను తగ్గించాలనే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. రేపు ఏపీలోని తహసీల్దార్ ఆఫీస్‌ల దగ్గర నిరసనలు తెలుపుతామని, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) మేల్కొని వెంటనే ఆదేశాలు జారీ చేయాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-28T21:16:37+05:30 IST