రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-01-03T01:31:55+05:30 IST
రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో
కొవ్వూరు: రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో కడుతున్న ఇళ్లు మోదీ ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. ఒక్క అర్బన్ ప్రాంతాలలోనే 16 లక్షల ఇళ్లకు రూ.35 వేల కోట్లు కేంద్రం ఇస్తుంటే, వాటిని జగన్ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు తప్పుబట్టారు.