Somu Veerraju: ప్రభుత్వ వైఫల్యాలపై 5వేల చోట్ల బిజేపీ ప్రజా పోరు సభలు..
ABN , First Publish Date - 2022-09-02T20:00:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5వేల చోట్ల బీజేపీ ప్రజా పోరు సభలు నిర్వహిస్తామని సోము వీర్రాజు తెలిపారు.
అమరావతి (Amaravathi): వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5వేల చోట్ల బీజేపీ (BJP) ప్రజా పోరు సభలు నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం (Jagan Govt.) విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ (PM Modi).. రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధుల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. కుటుంబ వారసత్వ, అవినీతి, కులతత్వ పార్టీలను రాష్ట్ర ప్రజలు బహిష్కరించాలన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. బహిరంగ సభలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ నేతలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు పాల్గొంటారన్నారు. సీఎం జగన్ సాగిస్తున్న అవినీతి, బంధుప్రీతి, మోసపూరిత రాజకీయాలను ఎండగడతామని సోమువీర్రాజు స్పష్టం చేశారు.