Somu Veerraju: జగన్రెడ్డి బటన్ నొక్కడం తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు..

ABN , First Publish Date - 2022-09-14T21:09:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ను దోచుకునే వారినే ప్రజలు ఎన్నుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Somu Veerraju: జగన్రెడ్డి బటన్ నొక్కడం తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు..

కడప (Kadapa): ఆంధ్రప్రదేశ్‌ను దోచుకునే వారినే ప్రజలు ఎన్నుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే సహజ వనరులన్నీ ఇక్కడి కుటుంబ పాలన చేస్తున్న నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఒక ఆయుధంగా చేసు కున్నారని, 8 లక్షల 60 వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారన్నారు. 3లక్షల కోట్లతో హైవేల నిర్మాణాలను కేంద్రం చేపట్టిందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి.. లిక్కర్, ఇసుక, గనులు మాఫియాగా మరి దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ లిక్కర్ షాపులో జగన్ పేటియం ఉంటుందని, లిక్కర్ ద్వారా విచ్చల విడిగా జగన్ దోచు కుంటున్నారని ఆరోపించారు. కనీసం బస్టాండ్ కూడా కట్టలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందన్నారు. నీటి ప్రాజెక్టుల గురించి రాయలసీమ నేతలు నోరెత్తడం లేదని, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. మూడు రాజధానులు అని చెప్పే నాయకులు అభివృద్ధి మాత్రం మూలాన పెట్టేశారని సోము వీర్రాజు విమర్శించారు. 

Updated Date - 2022-09-14T21:09:39+05:30 IST