Amaravathi: దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-18T17:50:12+05:30 IST

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీయేనని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. బీజేపీని పదే పదే మతతత్వ పార్టీ అని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఏ ప్రభుత్వం చేయని

Amaravathi: దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే: సోము వీర్రాజు

Amaravathi: దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీయేనని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. బీజేపీని పదే పదే మతతత్వ పార్టీ అని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. చర్చీలను ప్రభుత్వ నిధులతో కట్టిస్తోంది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. హిందూ ప్రాంతాల్లో మసీదులను దగ్గరుండి వైసీపీ ఎమ్మెల్యేలే కట్టిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే బీజేపీపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. హిందువులు గురించి మాట్లాడితే మతతత్వం అవుతుందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏదో లబ్ది చేస్తున్నామని..తమకే ఓట్లేస్తారని బొత్స భావిస్తున్నారని, అసలు రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనన్నారు. బొత్స సత్యనారాయణ జిల్లాలో రోడ్లను కేంద్ర ప్రభుత్వమే వేయించిం దన్నవిషయాన్నిఆయన గమనించాలన్నారు. ఈ విషయాలేమి తెలీక వైసీపీ ప్రజాప్రతినిథులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని బాధాకరమన్నారు.  

Updated Date - 2022-05-18T17:50:12+05:30 IST