మంత్రి బొత్సకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్

ABN , First Publish Date - 2022-05-23T20:11:02+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ..

మంత్రి బొత్సకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్

విజయనగరం : మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమేనని  పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వమని సోము వీర్రాజు పేర్కొన్నారు. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చిందని ప్రధాని మోదీ అని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - 2022-05-23T20:11:02+05:30 IST