తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-27T04:48:43+05:30 IST

తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

మోమిన్‌పేట: పనిచేసుకోమని తండ్రి మందలించడంతో కొడుకు ఆ త్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయన్‌పల్లికి చాకలి ప్రభాకర్‌(28) మోమిన్‌పేటలోని ఓ బైక్‌ మెకానిక్‌ షాపులో పనిచేస్తున్నాడు. వారం రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకో లేదా పొలం పనులకు రావాలని తండ్రి ప్రభాకర్‌ను మందలించడంతో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. ప్రభాకర్‌ భార్య నవీన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2021-07-27T04:48:43+05:30 IST