హైదరాబాదీ కుటుంబంలో దారుణం
ABN , First Publish Date - 2021-03-20T17:03:15+05:30 IST
తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన
- కన్న తండ్రిని చంపిన తనయుడు
- కత్తిపీటతో గొంతుకోసి హత్య
హైదరాబాద్/జడ్చర్ల : తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలోని ఉదండాపూర్ రోడ్డు వద్ద జరిగింది. జడ్చర్ల సీఐ వీరస్వామి, కావేరమ్మపేట వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన సయ్యద్మౌలానా (55)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా హైదరాబాద్లోని టోలీచౌక్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇద్దరు కుమారులు కావేరమ్మపేటలోని మేనత్త ఇంట్లో ఉంటూ కొత్తబస్టాండ్ సమీపంలో తినుబండారాలను హోమ్డెలివరీ చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు.
తమకు ఎలాంటి ఆధారంలేదని, ఇల్లు కట్టిస్తే, ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తామంటూ తండ్రి మౌలానాను కొడుకులు కోరారు. ఇటీవల హోమ్డెలివరీ వ్యాపారానికి సంబంధించిన మొబైల్ ఫోన్ను మౌలానా తీసుకెళ్లాడు. తినుబండారాల ఆర్డర్ కోసం ఫోన్ చేసిన వారితో ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఈ విషయం కొడుకులకు తెలిసింది. వ్యాపారానికి నష్టం వచ్చే విధంగా వ్యవహరించొద్దని తండ్రిని కోరారు. ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం ఉదండాపూర్కు వెళ్లే మలుపు వద్ద కుమారుడు ఇబ్రహీంను, సోదరి కుమారుడిని మౌలానా కలిశారు. తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన ఇబ్రహీం కూరగాయలు కోసే కత్తిపీటతో తండ్రి మౌలానా గొంతును కోసి హత్యచేశారు. తండ్రి రెండో భార్యతో కలిసి ఉండటంతో పాటు ఆస్తికి సంబంధించిన గొడవ కూడా హత్యకు దారితీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.