చిచ్చు పెట్టిన పార్టీలు.. కొడుకును హత్య చేసిన తండ్రి

ABN , First Publish Date - 2020-09-23T16:12:51+05:30 IST

సూర్యాపేట: తండ్రీకొడుకుల మధ్య పార్టీలు చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకును హతమార్చాడు.

చిచ్చు పెట్టిన పార్టీలు.. కొడుకును హత్య చేసిన తండ్రి

సూర్యాపేట: తండ్రీకొడుకుల మధ్య పార్టీలు చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకును హతమార్చాడు. ఇటీవల ఓ భార్యాభర్తల మధ్య పంచాయతీ విషయంలో చెరో వైపు నుంచి పెద్దమనుషులుగా తండ్రీకొడుకులు వ్యవహరించారు. తండ్రి ఈదప్ప కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ కాగా.. కొడుకు శ్రీశైలం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. నిన్న రెవెన్యూ చట్టం సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని ఇంటికి వచ్చిన సమయంలో తండ్రీకొడుకులు ఎదురుపడ్డారు. కర్రతో కొడుకు శ్రీశైలం తలపై తండ్రి ఈదప్ప బలంగా మోదడంతో అక్కడికక్కడే శ్రీశైలం మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తికి తరలించారు.

Updated Date - 2020-09-23T16:12:51+05:30 IST