మనోవ్యధతో కుమారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-24T05:56:42+05:30 IST

తల్లి మరణించి ఐదేళ్లయ్యింది. ఆ మనో వ్యధ ఇప్పటికీ వేధి స్తుండటంతో కుమారుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ తెలిపారు.

మనోవ్యధతో కుమారుడి ఆత్మహత్య

కొవ్వూరు, జూలై 23: తల్లి మరణించి ఐదేళ్లయ్యింది. ఆ మనో వ్యధ ఇప్పటికీ వేధి స్తుండటంతో కుమారుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ తెలిపారు. కొవ్వూరు మండలం వేములూరు దొరయ్యచెర్వు కాలనీకి చెందిన పిట్టల నరసయ్య భార్య ఐదేళ్ల క్రితం మరణించింది. దీంతో నరసయ్య చిన్న కుమారుడు సతీ్‌ష్‌(18) తల్లి మరణం తో బాధ పడుతుండేవాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సతీష్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. నరసయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-07-24T05:56:42+05:30 IST