HYD: తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-16T15:20:34+05:30 IST
తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్పేట ధరంకరం రోడ్డు హరిజన బస్తీలో నివసిస్తున్న అయిలపాటి ఆముదాలుకు
హైదరాబాద్/అమీర్పేట: తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్పేట ధరంకరం రోడ్డు హరిజన బస్తీలో నివసిస్తున్న అయిలపాటి ఆముదాలుకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు క్రాంతికుమార్(27) ప్రైవేట్ ఉద్యోగి. అతడు డ్యూటీకి సరిగా వెళ్లడం లేదు. ఇంట్లో చెప్పకుండా విహారయాత్రలకు వెళ్తున్నాడు. ఫోన్ చేసినా ఎత్తడంలేదని తల్లి మందలించింది. కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి వరకు సర్దిచెప్పి నిద్రపోయారు. సోమవారం ఉదయం క్రాంతికుమార్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించా రు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.