2024 వరకూ కాంగ్రెస్కు సర్వస్వం సోనియానే... కొందరు నేతలకు ప్రమోషన్?
ABN , First Publish Date - 2021-07-21T17:57:23+05:30 IST
కొంతకాలంగా కాంగ్రెస్కు ఎవరు సారధ్యం వహించనున్నారనే
న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్కు ఎవరు సారధ్యం వహించనున్నారనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం ఈ అంశాన్ని వాయిదావేస్తూ వస్తోంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 2024 వరకూ సోనియాగాంధీనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. అయితే పార్టీలో వివిధ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2024 లోపు రాహుల్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టబోరని కూడా సమాచారం. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేసులో గులామ్ నబీ ఆజాద్, సచిన్ పైలెట్, కుమారి షెల్జా, ముకుల్ వాసనిక్, రమేష్ చెన్నీథాలా పేర్లు వినిపిస్తున్నాయి.