భువనగిరి రైల్వే స్టేషన్లో ఎస్ఓటీ పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2021-06-14T23:26:53+05:30 IST
పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు
భువనగిరి: పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఆన్లైన్లో రైల్వే టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే ముందే బుక్ చేసి ఎక్కువ డబ్బులకు టికెట్లను రైల్వే సిబ్బంది అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రైల్వే స్టేషన్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్కువ డబ్బులకు టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రైల్వే టికెట్ కౌంటర్ ఉద్యోగి రవికుమార్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.