పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-11-01T02:37:54+05:30 IST
నగర శివారులోని పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసుల
హైదరాబాద్: నగర శివారులోని పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేసారు. ఒక యువ హీరో రిసార్ట్లో భారీగా నగదును పట్టుకున్నారు. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ నటుడి ఫామ్హౌస్లో నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసారు. పలువురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసారు. నిర్వాహకుడితో పాటు 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసారు. 25 లక్షల నగదు, ఖరీదైన కార్లను సీజ్ చేసారు.