ఏడు వికెట్లతో దుమ్మురేపిన శార్దూల్.. 229 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
ABN , First Publish Date - 2022-01-05T01:14:28+05:30 IST
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా
జొహన్నెస్బర్గ్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 27 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగే బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఆతిథ్య జట్టు బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు.
17.5 ఓవర్లు మాత్రమే వేసిన ఠాకూర్ 61 పరుగులిచ్చి కీలకమైన ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో కీగన్ పీటర్సెన్ (62), తెంబా బవుమా (51) మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 28 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి రెండు వికెట్లు దక్కగా, బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌట్ అయింది.