ఇండియాతో టీ20లకు జట్టును ప్రకటించిన South Africa.. ముంబై ఇండియన్స్ యువ పేసర్కు పిలుపు
ABN , First Publish Date - 2022-05-18T01:19:04+05:30 IST
భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. పరిమిత
కేప్టౌన్: భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు ప్రొటీస్కు ఇది కీలక సిరీస్ కానుంది. గతేడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో త్రుటిలో సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టీ20 టోర్నీ కానుంది. అలాగే, ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో సూపర్-12లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. జూన్ 9-19 మధ్య ఐదు మ్యాచ్లకు ఢిల్లీ, కటక్, విశాఖపట్టణం, రాజ్కోట్, బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నాయి.
యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్కు సఫారీ జట్టులో తొలిసారి చోటు లభించింది. క్రికెట్ సౌతాఫ్రికా (CSA) టీ20 చాలెంజ్లో ఈ 21 ఏళ్ల రైట్ హ్యాండ్, మిడిలార్డర్ బ్యాటర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడు ఇన్నింగ్స్లో 48.83 సగటుతో 293 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 183.12. ఇందులో 23 సిక్సర్లు కూడా ఉన్నాయి. జింబాబ్వేలో పర్యటించిన సౌతాఫ్రికా ఎ జట్టులోనూ సభ్యుడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగే, పేసర్ అన్రిక్ నార్జ్కు కూడా మళ్లీ పిలుపొచ్చింది. ప్రస్తుతం అతడు ఢిల్లీ కేపిటల్స్కు ఆడుతున్నాడు.