రెండు జట్లతో బరిలోకి దక్షిణాఫ్రికా
ABN , First Publish Date - 2021-01-24T10:12:53+05:30 IST
పాకిస్థాన్ పర్యటనలో టెస్ట్లు, టీ20లకు రెండు భిన్న జట్లతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది.
పాకిస్థాన్తో సిరీస్
జొహాన్నె్సబర్గ్: పాకిస్థాన్ పర్యటనలో టెస్ట్లు, టీ20లకు రెండు భిన్న జట్లతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ శనివారం వెల్లడించాడు. రెండు టెస్ట్లు ముగిసిన అనంతరం క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చి..ఆస్ట్రేలియాతో సిరీ్సకు క్వారంటైన్లోకి వెళతారని వివరించాడు. ఇక పాకిస్థాన్తో సిరీ్సలో భాగంగా దక్షిణాఫ్రికా రెండు టెస్ట్లు, మూడు టీ20లలో తలపడనుంది. తొలి టెస్ట్ ఈనెల 26న రావల్సిండిలో ప్రారంభం కానుంది.