ఓటమి దిశగా టీమిండియా.. విజయానికి మరింత చేరువైన సౌతాఫ్రికా
ABN , First Publish Date - 2022-01-14T21:51:02+05:30 IST
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఓటమికి మరింత చేరువగా దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం దిశగా
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఓటమికి మరింత చేరువగా దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజుల లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి విజయానికి 41 పరుగుల దూరంలో నిలిచింది. ఈ టెస్టు గెలిస్తే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-1తో సౌతాఫ్రికా వశమవుతుంది.
డుసెన్ 22, తెంబా బవుమా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా కీగన్ పీటర్సెన్ వికెట్ను కోల్పోయింది. 113 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు చేసిన పీటర్సెన్ను శార్దూల్ ఠాకూర్ బౌలింగులో బౌల్డయ్యాడు.