ప్రారంభమైన ఆట.. లక్ష్యానికి చేరువగా దక్షిణాఫ్రికా
ABN , First Publish Date - 2022-01-07T01:43:38+05:30 IST
వర్షం కారణంగా ఆగిన నాలుగో రోజు ఆట కాసేపటి క్రితం ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా విజయానికి మరింత
జొహన్నెస్బర్గ్: వర్షం కారణంగా ఆగిన నాలుగో రోజు ఆట కాసేపటి క్రితం ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా విజయానికి మరింత చేరువకాగా, వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జొహన్నెస్బర్గ్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో నాలుగో రోజు రెండు సెషన్ల ఆట వర్షార్పణమైంది.
ఆ తర్వాత వర్షం కాస్తంత తెరిపినివ్వడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఓవర్నైట్ స్కోరు 118/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా నిదానంగా ఆట ప్రారంభించింది. ఈ క్రమంలో 44 ఓవర్ ఐదో బంతిని బౌండరీకి తరలించిన కెప్టెన్ డీన్ ఎల్గర్ అర్ధం సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఎలాంటి తడబాటు లేకుండా ఆడుతున్న ఎల్గర్, డుసెన్లు జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసిన సఫారీలు విజయానికి 67 పరుగుల దూరంలో ఉన్నారు. ఎల్గర్ 58, డుసెన్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.