భైంసా నిందితులను వదిలే ప్రసక్తి లేదు
ABN , First Publish Date - 2021-03-09T22:50:34+05:30 IST
జిల్లాలోని భైంసా పట్టణంలో జరిగిన ఘటనకు కారకులైన
నిర్మల్: జిల్లాలోని భైంసా పట్టణంలో జరిగిన ఘటనకు కారకులైన నిందితులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైంసా పట్టణం ప్రశాంతంగా ఉందని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దన్నారు. వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టె వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ విష్ణు తెలిపారు. పట్టణంలోకి రావడానికి కొత్త వారికి ఎవరికీ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పట్టణంలో పోలీసు బలగాల కవాతును నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది.