పోలేపల్లి ఎల్లమ్మ జాతర బందోబస్తుపై ఎస్పీ పరిశీలన
ABN , First Publish Date - 2021-03-04T05:14:31+05:30 IST
మండలంలోని పోలేపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మ జాతర బందోబ స్తును ఎస్పీచేతన బుధవారం పరిశీలించారు.
కోస్గి రూరల్, మార్చి 3 : మండలంలోని పోలేపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మ జాతర బందోబ స్తును ఎస్పీచేతన బుధవారం పరిశీలించారు. పోలేపల్లిలో ఎల్లమ్మ జాతరకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తుకు సంబంధించి కోస్గి సీఐ రామ్లాల్, ఎస్ఐ నరేందర్లకు సూచనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.