ఎస్పీ ఆఫీస్కు గుర్ల ఎస్ఐ సరెండర్
ABN , First Publish Date - 2020-11-29T17:45:52+05:30 IST
గుర్ల ఎస్ఐ నీలావతిని ఎస్పీ కార్యాలయానికి..
దేవునికణపాక భూ ఆక్రమణల వ్యవహారమే కారణం
గుర్ల(విజయనగరం): గుర్ల ఎస్ఐ నీలావతిని ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దేవునికణపాక భూముల ఆక్రమణలపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘కొండలు బెదురుతున్నాయ్’ శీర్షికన వచ్చిన కథనానికి పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. యంత్రాలతో పనులు చేసినట్టు తేలినా కేసులు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆక్రమణల పర్వానికి సంబంధించి నలుగురు అధికారులపై వేటుపడింది. తహసీల్దారుపై సస్పెన్షన్ వేటుపడగా..ఆర్ఐకు విమానాశ్రయ భూ సేకరణ విభాగానికి బదిలీ అయ్యింది. ఇంకా అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ సాగుతోంది.