ఏలూరులో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతం.. నిఘా పెట్టాం : ఎస్పీ రాహుల్

ABN , First Publish Date - 2021-07-25T15:10:44+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది.

ఏలూరులో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతం.. నిఘా పెట్టాం : ఎస్పీ రాహుల్

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కౌంటింగ్‌పై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రత్యేకంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఏలూరులో ఎన్నికల కౌంటింగ్  ప్రశాంతంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఫలితాలు వచ్చాక నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని శర్మ స్పష్టం చేశారు. సెక్షన్-30 అమలులో ఉందని.. నగరంలో అనుమానితులపై నిఘా పెట్టామన్నారు. భద్రతా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేశామని.. అందులో ఒకరికి పాజిటివ్ అని తేలిందని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-07-25T15:10:44+05:30 IST