అదనపు ఎస్పీ జగదీశ్కు చిత్తూరు బదిలీ
ABN , First Publish Date - 2022-05-18T06:45:00+05:30 IST
స్థానిక అదనపు ఎస్పీగా పని చేస్తున్న 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పి.జగదీశ్ను చిత్తూరు అదనపు ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాడేరుకు సెబ్ కర్నూల్ అదనపు
ఎస్పీ తుహిన్ సిన్హా నియామకం
పాడేరు, మే 17(ఆంధ్రజ్యోతి): స్థానిక అదనపు ఎస్పీగా పని చేస్తున్న 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పి.జగదీశ్ను చిత్తూరు అదనపు ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అదే బ్యాచ్కు చెందిన కర్నూల్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా పని చేస్తున్న తుహిన్ సిన్హాను నియమించింది. పి.జగదీశ్కు తొలి పోస్టింగ్ గతేడాది జూలై నెలలో పాడేరుఏఎస్పీగా వచ్చింది. ఆయన్నే ఈ ఏడాది ఏప్రిల్లో స్థానిక అల్లూరి సీతారామరాజు జిల్లాకుఅదనపు ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. గత పది నెలలుగా ఆయన స్థానిక సబ్ డివిజన్ పరిధిలో పోలీసు సేవలను విస్తరించడంతో పాటు ప్రజలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఆయనను చిత్తూరు జిల్లాకు అదనపు ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది.