కానిస్టేబుల్కు నగదు రివార్డు అందజేసిన ఎస్పీ
ABN , First Publish Date - 2021-10-17T05:40:16+05:30 IST
నాటుసారా తయారీపై సమాచారమిచ్చిన హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్రాజును శనివారం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించి నగదు రివార్డు అందజేశారు.
కడప(క్రైం), అక్టోబరు 16 : నాటుసారా తయారీపై సమాచారమిచ్చిన హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్రాజును శనివారం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించి నగదు రివార్డు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ ఇటీవలి కడప - ప్ర కాశం జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జిల్లా పోలీసుల నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహిచి పెద్ద ఎ త్తున బెల్లం ఊటను ధ్వంస చేశారు. 5 వేల లీటర్ల పైగా బె ల్లం ఊట ధ్వంసం చేయడంలో కీలక సమాచారం అందించిన మధుసూధనరాజును ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు పాల్గొన్నారు.