ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

ABN , First Publish Date - 2022-05-24T06:05:02+05:30 IST

స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన
ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న మేయర్‌

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

 మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, మే 23 : స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.  నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా మేయర్‌, కమిషనర్‌లకు అందజేశారు. మొత్తం 14అర్జీలు వచ్చాయి. సర్కిల్‌-1లో 3 అర్జీలు వచ్చాయి. సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మేయర్‌ అధికారులకు సూచించారు. అదనపు కమిషనర్‌ (జనరల్‌) ఎం.శ్యామల, అదనపు కమిషనర్‌ ప్రాజెక్ట్‌  కేవీ సత్యవతి, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. ప్రభాకరరావు, చీఫ్‌ మెడికల్‌ అఽపీసర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సీ.హెచ్‌. బాబు శ్రీనివాస్‌, సిటీ ప్లానర్‌ జి.వి.జిఎస్‌.వి.ప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:05:02+05:30 IST