స్పందనతో సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-07-27T03:34:35+05:30 IST

స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించుతున్నట్లు తహసీల్దార్‌ వై. నాగరాజు తెలిపారు. సోమవారం నుంచి

స్పందనతో సమస్యల పరిష్కారం
అర్జీ స్వీకరిస్తున్న తహసీల్దార్‌ నాగరాజు

 మనుబోలు, జూలై 26: స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించుతున్నట్లు తహసీల్దార్‌ వై. నాగరాజు తెలిపారు. సోమవారం నుంచి స్పందనను పునఃప్రారంభించారు.  తొలిరోజు కావడంతో భూ సమస్యపై ఓ అర్జీ మాత్రమే వచ్చిందని తెలిపారు.   స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళాపోలీసులతో  ఎస్పీ విజయారావు వీడియో కాన్ఫరెన్స్‌ ధ్వారా  మాట్లాడారు.  ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ ఉండేలా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ. కే. ముత్యాలరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T03:34:35+05:30 IST