స్పందనతో సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2021-07-27T03:34:35+05:30 IST
స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించుతున్నట్లు తహసీల్దార్ వై. నాగరాజు తెలిపారు. సోమవారం నుంచి
మనుబోలు, జూలై 26: స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించుతున్నట్లు తహసీల్దార్ వై. నాగరాజు తెలిపారు. సోమవారం నుంచి స్పందనను పునఃప్రారంభించారు. తొలిరోజు కావడంతో భూ సమస్యపై ఓ అర్జీ మాత్రమే వచ్చిందని తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లోనూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళాపోలీసులతో ఎస్పీ విజయారావు వీడియో కాన్ఫరెన్స్ ధ్వారా మాట్లాడారు. ప్రతి మహిళ సెల్ఫోన్లో దిశ యాప్ ఉండేలా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ. కే. ముత్యాలరావు పాల్గొన్నారు.