పిచ్చికుక్క స్వైర విహారం
ABN , First Publish Date - 2021-03-02T06:17:48+05:30 IST
మండలంలోని మూడు గ్రామాల్లో సోమవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. మేడిచర్లలో బొడ్డు దేముడు, బి.దేముడులను తీవ్రంగా కరిచింది.
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
కె.కోటపాడు, మార్చి 1: మండలంలోని మూడు గ్రామాల్లో సోమవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. మేడిచర్లలో బొడ్డు దేముడు, బి.దేముడులను తీవ్రంగా కరిచింది. అక్కడ నుంచి కోటపాడుకి చేరుకుని బైలపూడి శ్రీనివాస్, పూడి తాత, ఎం.సన్యాసమ్మ, సమ్మింగ నూకాలమ్మ, రొంగలి రామునాయుడులను, జోగన్నపాలెంలో బండారు ఈశ్వరరావులను తీవ్రంగా గాయపరిచింది. వీరందరికీ కోటపాడు సీహెచ్సీలో డాక్టర్ కల్యాణి చికిత్స నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన బైలపూడి శ్రీనివాస్, రొంగలి రామునాయుడు, బండారు ఈశ్వరరావు, బి.దేముడుల పరిస్థితి విషమించడంతో 108లో విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు.