వరసిద్ధుడి సేవలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌

ABN , First Publish Date - 2022-08-18T05:51:14+05:30 IST

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా బుధవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌
స్పీకర్‌కు జ్ఞాపికను అందిస్తున్న చైర్మన్‌, ఈవో

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 17: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా బుధవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వారికి కలెక్టర్‌ హరినారాయణన్‌, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు. ఆర్డీవో రేణుక, తహసీల్దార్‌ సుశీల, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:51:14+05:30 IST