ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-26T19:42:28+05:30 IST

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావటానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావటానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం పరిష్కారం కాదు..‌ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ విదేశీ విధానంతో అందరకీ ఆదర్శవంతం అవుతుందన్నారు. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. భారతీయల తరలింపులో ప్లాన్ ఏ..బీ‌..సీలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలు, హాస్టళ్లను గుర్తిస్తున్నామని తెలిపారు. భారతీయ విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. విదేశాంగ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-02-26T19:42:28+05:30 IST