ప్రత్యేక బస్సుల్లో 1.66 లక్షల మంది ప్రయాణం

ABN , First Publish Date - 2022-04-15T15:10:39+05:30 IST

తమిళ ఉగాది, గుడ్‌ప్రైడే సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటంతో రాష్ట్ర రవాణా సంస్థ నడిపిన మూడు వేల ప్రత్యేక బస్సుల్లో బుధవారం సాయంత్రం నుంచి

ప్రత్యేక బస్సుల్లో 1.66 లక్షల మంది ప్రయాణం

చెన్నై: తమిళ ఉగాది, గుడ్‌ప్రైడే సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటంతో రాష్ట్ర రవాణా సంస్థ నడిపిన మూడు వేల ప్రత్యేక బస్సుల్లో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ 1.66లక్షల మంది ప్రయాణించారు. విల్లుపురం, సేలం, కుంభకోణం, చెన్నై, మదురై నగరాల్లోని ప్రధాన రవాణా సంస్థల నుంచి 1200ల ప్రత్యేక బస్సులను నాలుగు రోజులపాటు నడుపనున్నారు. చెన్నై నుండి తిరుచ్చి, మదురై, సేలం, హోసూరు, తిరువణ్ణామలై, వేలూరు, రాణిపేట, కల్లకురిచ్చి, విల్లుపురం తదితర నగరాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-15T15:10:39+05:30 IST