రేపటి నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2021-03-07T04:08:26+05:30 IST

మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా నారా యణపేట నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈనెల 7వతేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు డీఎం సూర్యప్రకాష్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

నారాయణపేట, మార్చి 6 : మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా నారా యణపేట నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈనెల 7వతేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు డీఎం సూర్యప్రకాష్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 7, 8తేదీల్లో మూడు బస్సులు, 9న 4, 10న 8, 11న 15, 12న 5 బస్సులను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు, ప్రయాణి కులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-03-07T04:08:26+05:30 IST