నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-07-25T06:07:37+05:30 IST
గుర్రం కొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుర్రంకొండ, జూలై 24: గుర్రం కొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశారు.