ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక మేళాలు
ABN , First Publish Date - 2021-02-28T08:13:49+05:30 IST
ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేసేందుకు మునిసిపల్ అధికారులు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేసేందుకు మునిసిపల్ అధికారులు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహించనున్నారు. వీలైతే ఆదివారం కూడా ఈ మేళాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. మార్చి నెలాఖరు వరకు ఈ మేళాలను నిర్వహించాలని కమిషనర్లను మునిసిపల్ శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశించారు.