మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ABN , First Publish Date - 2022-06-30T04:10:33+05:30 IST
బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతాశ్రీధర్ అన్నారు. కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు.
- చైర్పర్సన్ జక్కుల శ్వేతాశ్రీధర్
బెల్లంపల్లి, జూన్ 29: బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతాశ్రీధర్ అన్నారు. కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రగతి నిధులతో క్రీడా ప్రాంగణం చుట్టు ఫెన్సింగ్, క్రీడా సామగ్రి ఏర్పాటు, పొచమ్మ చెరువు చిల్డ్రన్ పార్కు అభివృద్ధి చేసేందుకు ఆమోదించామన్నారు. వైకుంఠరథం కొనుగోలు చేస్తామని, రాంనగర్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు నిధులు కేటాయించినట్టు చెప్పారు. ప్రత్యేక నిధులతో లవ్ బెల్లంపల్లి ప్రాంగణాన్ని సుందరీకరిస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కమీషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.