పార్వేట..

ABN , First Publish Date - 2021-01-17T05:39:35+05:30 IST

పార్వేటలో భాగంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ పల్లకి బాచేపల్లెకు చేరుకోవడంతో శనివారం ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.

పార్వేట..
పూజలందుకుంటున్న అహోబిలేశుడు

ఆళ్లగడ్డ, జనవరి 16: పార్వేటలో భాగంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ పల్లకి బాచేపల్లెకు చేరుకోవడంతో శనివారం ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ పల్లకి గ్రామానికి మొదటి రోజున రావడంతో గ్రామపెద్దలు, అధికారులు మేళతా ళాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని తెలుపుల వద్ద ఉత్సవ పల్లకి విడిది చేయడంతో ప్రజలంతా ఉత్సవ పల్లకిలోని ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వాములకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కానుకలు సమర్పించుకున్నారు. ఉత్సవ పల్లకి ఆదివారం కొండంపల్లె గ్రామానికి చేరుకోనుంది. 


Updated Date - 2021-01-17T05:39:35+05:30 IST