మహానందీశ్వరుడికి అన్నాభిషేకం

ABN , First Publish Date - 2022-06-30T06:05:10+05:30 IST

పరమ శివుని జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మహానందిలో బుధవారం వేదపండితులు అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

మహానందీశ్వరుడికి అన్నాభిషేకం
అన్నాభిషేకంలో పాల్గొన్న ఈవో చంద్రశేఖర్‌రెడ్డి

మహానంది, జూన్‌ 29: పరమ శివుని జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మహానందిలో బుధవారం వేదపండితులు అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వయంభువు లింగానికి గణపతిపూజ, కలశార్చన పూజలు నిర్వహించారు. అనంతరం 108 కేజీల అన్నాన్ని అన్నసూక్తంతో అభిమంత్రించి వైభవంగా అన్నాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈవో ఎర్రమల్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:05:10+05:30 IST