‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’కు విశేష ఆదరణ

ABN , First Publish Date - 2021-03-09T08:12:12+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ1 ఎక్స్‌ప్రెస్‌ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని ఆ సినిమా హీరో సందీప్‌కిషన్‌ అన్నారు.

‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’కు విశేష ఆదరణ
సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠిలతో మహేష్‌ విట్టా

హాకీ నేపథ్యంలో పూర్తిస్థాయిలో తెలుగులో తొలిసారిగా వచ్చిన చిత్రమిది

సినిమా హీరో సందీప్‌ కిషన్‌ 


తిరుచానూరు, మార్చి 8: బంద్‌, ఎన్నికల సమయంలో ప్రజలు ఎంత బిజీగా ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ1 ఎక్స్‌ప్రెస్‌ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని ఆ సినిమా హీరో సందీప్‌కిషన్‌ అన్నారు. విజయోత్సవ యాత్రలో భాగంగా ఏ1ఎక్స్‌ప్రెస్‌ చిత్రం యూనిట్‌ సోమవారం సంధ్య థియేటర్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ.. పక్కా మాస్‌ సినిమాను స్పోర్ట్స్‌ బ్యాగ్‌డ్రాప్‌లో మోడ్రన్‌గా తీశామన్నారు. హాకీ క్రీడ నేపథ్యంలో పూర్తిస్థాయిలో తెలుగులో తొలిసారిగా వచ్చిన చిత్రమిదన్నారు. తన 25వ సినిమాను రీమేక్‌ చేయడానికి కారణం ఈ చిత్ర కథలోని బలమేనని చెప్పారు. హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి మాట్లాడుతూ.. కొవిడ్‌ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు సందేశాత్మకంగా వచ్చిన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. తొలిసారిగా థియేటర్‌లో ప్రేక్షకులను కలవడం మరుపురాని అనుభూతి అన్నారు. చిత్ర దర్శకుడు డెన్నీస్‌జీవన్‌, సహాయనటుడు మహేష్‌ విట్టా మాట్లాడుతూ.. మంచి సినిమాతో వస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ఏ1ఎక్స్‌ప్రెస్‌ నిరూపించిందన్నారు. డిస్ర్టిబ్యూటర్‌ నాగార్జున, ఎన్వీఆర్‌ ఫిలిమ్స్‌ మేనేజర్‌ ఈశ్వరయ్య, సంద్య థియేటర్‌ మేనేజర్‌ మాధవరెడ్డి తదితరులు చిత్రబృందాన్ని సన్మానించారు. 

Updated Date - 2021-03-09T08:12:12+05:30 IST