దర్వేశిపురంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-01-25T05:42:52+05:30 IST

మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది.

దర్వేశిపురంలో ప్రత్యేక పూజలు
పూజల్లో పాల్గొన్న భక్తులు

కనగల్‌, జనవరి 24 : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివుడి విగ్రహం వద్ద ప్రమిదలు వెలిగించి దీపారాధన చేసారు. పుట్టలో పాలు పోసి నాగపడిగలకు మొక్కుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరాలని ముడుపులు కట్టారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఈవో ప్రభాకరసత్యమూర్తి, సిబ్బంది చంద్రయ్య, లింగయ్య, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు అర్చకులు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యులు, సుదర్శణాచార్యులు, ఫణి, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:42:52+05:30 IST