తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-05-19T18:08:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. కార్యకర్తల సంక్షేమం కోసం  భారీ మొత్తంలో నేతలు, కార్యకర్తలు విరాళాలు ఇస్తున్నారు. గుంటూరుకు చెందిన భాష్యం ప్రవీణ్ రూ. 10 లక్షలు, చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలానికి చెందిన కుర్రా అప్పారావు రూ. 5 లక్షలు విరాళంగా అందజేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం  కారంచేడుకు చెందిన  యార్లగడ్డ కృష్ణ రూ. 5 లక్షలు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన  ఇంటూరి నాగేశ్వరావు రూ.  500116, తూగో జిల్లా అమలాపురంకు చెందిన వి.‍యస్ ఆర్ రావు రూ.5,50,000  పార్టీకి విరాళాలుగా ఇచ్చారు.  కార్యకర్తల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వటం అభినందనీయమని టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్న వారిని, పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నవారిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తుందని తెలిపింది. ఈ విరాళాలు కార్యకర్తల సంక్షేమం, వారి పిల్లల చదువులకు వినియోగించటం జరుగుతుందని టీడీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. 

Updated Date - 2022-05-19T18:08:25+05:30 IST