ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ కార్యాచరణ ప్రకటించాలి: కనకమేడల

ABN , First Publish Date - 2022-02-13T19:46:22+05:30 IST

ప్రత్యేకహోదా సాధన కోసం సీఎం జగన్ కార్యాచరణ ప్రకటించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు.

ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ కార్యాచరణ ప్రకటించాలి: కనకమేడల

అమరావతి: ప్రత్యేకహోదా సాధన కోసం సీఎం జగన్ కార్యాచరణ ప్రకటించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా కోసం కేంద్రంపై జగన్ పోరాడితే కలిసి నడవడానికి టీడీపీ సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం 28 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే..  నలుగురు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. జగన్‌రెడ్డి దాగుడు మూతలాడుతున్నారని తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వం అడగకపోవడం వల్లే.. హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారని పేర్కొన్నారు. జగన్ స్వప్రయోజనాల కోసం హోదా అంశాన్ని వాడుకుంటున్నారని, కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌రెడ్డి బయటకు రావాలని కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-13T19:46:22+05:30 IST