ప్రత్యేక హోదా సాధించాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-06-20T19:18:34+05:30 IST
ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని సీఎం జగన్ చెప్పారని, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడేళ్లలో ఏపీకి ప్రధాని మోదీ ద్రోహం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. జగన్ ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రామకృష్ణ కోరారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని... పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని... వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. లోక్సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని అభ్యర్థించడం మినహా ఏం చేయలేమని చేతులెత్తేశారు.