Special Status: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-20T16:57:24+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తులసిరెడ్డి అన్నారు.

Special Status: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది: తులసిరెడ్డి

విజయవాడ (Vijayawada): కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) వస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Tulasi Reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవినీ, ప్రాణ వాయువని అన్నారు. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 2014లో గానీ, 2019లో గానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే ఈ పాటికి ప్రత్యేక హోదా అమలై ఉండేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేదన్నారు.


ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ (BJP) స్పష్టంగా చెప్పిందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీ (AP)కి ప్రత్యేక హోదా రాదని తులసిరెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలైనా టీడీపీ (TDP), వైసీపీ (YCP), జనసేన (Janasena) పార్టీలకు ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదని విమర్శించారు. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-20T16:57:24+05:30 IST