మైసూరు నుంచి దనపూర్కు ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2021-05-11T04:13:27+05:30 IST
యాణికుల సౌకర్యార్ధం మైసూరు నుంచి దనపూర్కు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
14 వరకు రాయపూర్ రైలు రద్దు
విశాఖపట్నం, మే 10: ప్రయాణికుల సౌకర్యార్ధం మైసూరు నుంచి దనపూర్కు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. కాగా ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ, రాయపూర్ మధ్య రాకపోకలు సాగిస్తున్న 08528, 08527 నంబరు గల రైళ్లను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
07314 నంబరు గల రైలు ఈ నెల 13న ఉదయం 11.00 గంటలకు మైసూరులో బయలుదేరి మర్నాడు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరి తిరిగి 8.15 గంటలకు బయలుదేరి శనివారం రాత్రి 8.45 గంటలకు దనపూర్ చేరుతుంది.