Special Train: నరసాపురం నుంచి వచ్చే ట్రైన్స్‌లో వెళుతుంటారా.. అయితే ఆగస్ట్ 26 సాయంత్రం 4.40కి..

ABN , First Publish Date - 2022-08-26T01:17:56+05:30 IST

నరసాపురం - యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌)ల మధ్య శుక్రవారం ప్రత్యేక రైలు నడుపుతున్న స్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు. 07125 నెంబర్‌తో..

Special Train: నరసాపురం నుంచి వచ్చే ట్రైన్స్‌లో వెళుతుంటారా.. అయితే ఆగస్ట్ 26 సాయంత్రం 4.40కి..

నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం - యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌)ల మధ్య శుక్రవారం ప్రత్యేక రైలు నడుపుతున్న స్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు. 07125 నెంబర్‌తో సాయంత్రం 4:40 గంటలకు నరసాపురంలో ఈ రైలు బయలు దేరుతుందన్నారు. గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జాలార్‌పేట మీదుగా ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు శనివారం సాయంత్రం 07126 నెంబర్‌తో బెంగళూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. 20 బోగీలతో నడిచే ఈ స్పెషల్‌ రైలు  పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్‌, ఆకివీడు స్టేషన్‌లో ఆగుతుందన్నారు. నరసాపురం నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడు హైదరాబాద్‌, తిరుపతి, నాగర్‌సోల్‌ వంటి రెగ్యులర్‌ రూట్‌లలో మాత్రమే స్పెషల్‌ రైళ్లను నడుపుతూ వచ్చారు. బెంగళూర్‌కు స్పెషల్‌ వేయడం ఇదే తొలిసారి. ఈ రైలుకు డిమాండ్‌ ఉంటే దాన్ని ప్రతి శుక్రవారం కొనసాగించే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2022-08-26T01:17:56+05:30 IST