కడప మీదుగా కాచిగూడకు స్పెషల్‌ ట్రైన

ABN , First Publish Date - 2021-01-24T05:31:38+05:30 IST

కాచిగూడ నుంచి మంగుళూరు సెంట్రల్‌కు (02777) స్పెషల్‌ ట్రైన ఈనెల 29వ తేదీ నుంచి ప్రయాణం కానుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన చీఫ్‌ కమర్షియల్‌ మేనేజరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కడప మీదుగా కాచిగూడకు స్పెషల్‌ ట్రైన

కడప (ఎర్రముక్కపల్లె), జనవరి 23 : కాచిగూడ నుంచి మంగుళూరు సెంట్రల్‌కు (02777) స్పెషల్‌ ట్రైన ఈనెల 29వ తేదీ నుంచి ప్రయాణం కానుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన చీఫ్‌ కమర్షియల్‌ మేనేజరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న కాచిగూడ రైల్వేస్టేషన నుంచి ఉదయం 6.05 గంటలకు ప్రారంభమై ఎర్రగుంట్లకు మధ్యాహ్నం 1.49కి చేరుకుంటుందన్నారు. 1.50కి తిరిగి ప్రయాణమై కడప రైల్వేస్టేషనకు మధ్యాహ్నం 2.33 గంటలకు చేరుకుని 2.35కు తిరిగి ప్రయాణమవుతుందన్నారు. రేణిగుంట, కోయంబత్తూరు జంక్షన మీదుగా మరుసటిరోజు (30వ తేదీ) ఉదయం 9.30 గంటలకు మంగుళూరు చేరుకుంటుందన్నారు. అలాగే మంగుళూరులో 30వ తేదీ రాత్రి 8.05కు ప్రారంభమై మరుసటిరోజు మధ్యాహ్నం 2.03 గంటలకు కడప రైల్వేస్టేషన చేరుకుని 2.05కు ప్రారంభమై అదే రోజు రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన చేరుకుంటుందన్నారు.

Updated Date - 2021-01-24T05:31:38+05:30 IST