టీచర్లకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలి: పీఆర్టీయూ
ABN , First Publish Date - 2021-05-09T05:52:36+05:30 IST
టీచర్లకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
చిత్తూరు(సెంట్రల్), మే 8: టీచర్లకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సమాజానికి వెన్నెముక లాంటి టీచర్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు విజ్ఞప్తి చేశారు.