దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-04-23T09:44:31+05:30 IST
దివ్యాంగులకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అ
సీఎంకు అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, కరోనా పరీక్షల కోసం కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయనున్నందున ప్రస్తుత కేంద్రాల్లో దివ్యాంగులు వ్యాక్సిన్ వేసుకోవడం కష్టమవుతుందని తెలిపారు.