ఉపన్యాసం తెచ్చిన తంటా!
ABN , First Publish Date - 2022-01-24T06:33:31+05:30 IST
ఉక్రెయిన్ నుంచి క్రిమియాను 2014లోనే రష్యా స్వా ధీనం చేసుకుందంటూ జర్మనీ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కే అచిమ్ స్కోన్బాచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ..
పదవిని కోల్పోయిన జర్మనీ నేవీ చీఫ్ అచిమ్
భారత్ పర్యటనలో ఉక్రెయిన్పై చేసిన
వివాదాస్పద వ్యాఖ్యలే కారణం
న్యూఢిల్లీ, జనవరి 23: ఉక్రెయిన్ నుంచి క్రిమియాను 2014లోనే రష్యా స్వా ధీనం చేసుకుందంటూ జర్మనీ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కే అచిమ్ స్కోన్బాచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఏకంగా ఆయన తన పదవి నే కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అచిమ్ ఈ నెల 21న ఢిల్లీలోని మనోహర్ పర్రీకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీ్సలో ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావించారు. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ మర్యాద కోరుకునే మనిషి. క్రిమియాను ఎప్పటికీ వదులుకోరు. ఉక్రెయిన్ దీన్ని తిరిగి పొందలేదు’’ అన్నా రు. ఈ వ్యాఖ్యలపై జర్మనీ, ఉక్రెయిన్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో అచిమ్ తన పదవికి రాజీనామా చేశారు