జలజీవన్ పనులు వేగవంతం
ABN , First Publish Date - 2022-06-30T05:21:45+05:30 IST
పార్వతీపురం మన్యం జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ ఢిల్లీ డైరెక్టర్ ప్రదీప్సింగ్ ఆదేశించారు. బుధవారం సాలూరు మండలంలోని అన్నంరాజువలస, తాడంగి వలస గ్రామాల్లో పర్యటించారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రదీప్సింగ్
సాలూరు రూరల్/సీతానగరం, జూన్ 29: పార్వతీపురం మన్యం జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ ఢిల్లీ డైరెక్టర్ ప్రదీప్సింగ్ ఆదేశించారు. బుధవారం సాలూరు మండలంలోని అన్నంరాజువలస, తాడంగి వలస గ్రామాల్లో పర్యటించారు. ఆయా చోట్ల జలజీవన్ పనులను పరిశీలించారు. అందరికి తాగునీరందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులు అందిస్తున్నారు. సత్వరం ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసి అందరికీ తాగునీరు అందించాలని సూచించారు. అధికారులు దీనిపై శ్రద్ధ చూపాలన్నారు. కాగా అన్నంరాజువలసలో పనులు పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. అనంతరం ఆయన సీతా నగరం మండలంలోని రామవరం, బక్కుపేట, రెడ్డివానివలస, కాశీపేట, గ్రామాల్లోనూ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్బ్ల్యూఎస్ డీఈ ప్రభాకర్, జేఈ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.